గొల్లపల్లి: రంగధామునిపల్లి గ్రామంలో కరెంటు లేక వరి నారుకు బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి గ్రామంలో పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పాడై కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయి. వరి నారు ఎండిపోకుండా బిందెలతో రైతులు నీళ్లు పోస్తున్నారు. పది రోజులైనా ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేయకపోవడంతో నీరు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.