ఆలూరు: ఆస్పరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ
Alur, Kurnool | Jul 5, 2025 ఆస్పరిలో శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై టీడీపీ నాయకుడు సతీశ్ కుమార్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్ఛార్జి లేకుండా సుపరిపాలన కార్యక్రమం ఎలా నిర్వహించారని తిక్కారెడ్డిని ప్రశ్నించారు