కడప జిల్లా పులివెందులలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక వృద్ధుడిని భయపెట్టి, రూ. 1.62 కోట్లు దోచుకున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ముంబై సీబీఐ అధికారులమని నటిస్తూ, వాట్సాప్ ద్వారా బెదిరించి ఈ మోసానికి పాల్పడినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 1,05,300 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులను ఎస్పీ అభినందించారు.