మేడ్చల్ నియోజకవర్గంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. తూముకుంట కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వైద్యుత్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేవరయం మండల పాఠశాలలో విద్యార్థులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.