తెలంగాణలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలన భవనం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. అధికారులు హామీలను అమలు చేయకపోతే, బేసిక్ పే, డి ఎ, హెచ్ఆర్ఏ తో కూడిన పేస్కేల్లని వెంటనే ఇవ్వాలని లేకపోతే యూనివర్సిటీలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.