సంగారెడ్డి: కౌలంపేటలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సంఘం ఆఫీసర్లు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి జిల్లా కందిమండలం కౌలంపేట లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులు ఉదయ్ కుమార్ రాకేష్ లు పరిశీలించారు ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు పనిచేయాలని అభ్యర్థుల ఖర్చును ప్రతి పైసా పరిశీలించాలన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.