కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజ్ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో మంత్రి టి.జి.భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.అనస్తీషియా డాక్టర్ల కొరతను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, 24 గంటలు రేడియాలజిస్ట్ విధుల్లో ఉండేలా చూడాలన