ఎల్బీనగర్ చౌరస్తాలో బిజెపి నాయకుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ శనివారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ని బిజెపి నాయకులు తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉధృతికత చోటుచేసుకుంది. కొందరు బిజెపి నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.