కొండపి: కొండపి అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహణ
కొండపి బస్టాండ్ సెంటర్లో మంగళవారం కొండపి అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకట్రావు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారో ప్రయోగాత్మకంగా ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. వేసవి సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.