కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మున్సిపాలిటీ స్వాగత ఆర్చి ఏర్పాటు కోసం తవ్విన గుంతలో పాల వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. కుప్పం వైపు నుంచి మితిమీరిన వేగంతో వాహనం రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పాల వ్యాన్ ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.