నంద్యాల జిల్లా బేతంచెర్లలోని సంత మార్కెట్ ఖాళీగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి సంత మార్కెట్ నిర్మాణం చేసినప్పటికీ వ్యాపారులు లోపల వ్యాపారం చేయకుండా బయట చేస్తుండటంతో ఈ మార్కెట్ నిర్మానుష్యంగా మారింది. రోడ్లమీద వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య అధికమయ్యింది. ఇప్పటికైనా అధికారులు వ్యాపారులకు అవగాహన కల్పించి, సంత మార్కెట్లో వ్యాపారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.