స్క్రబ్ టైఫస్ జ్వరాలపై చింతపర్తి పీ. హెచ్. సి. పరిధిలోని గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు విరివిగా నిర్వహించి అప్రమత్తం చేస్తున్నామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆదేశాల మేరకు చింతపర్తి పీ. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేక బేగం ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ గండ బోయినపల్లి గ్రామంలో రైతులకు, ప్రజలకు మరియు చింతపర్తి ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల కు, అంగన్వాడీ కార్యకర్తలకు, శనివారం స్క్రబ్ టైపస్ వ్యాధి పై అవగాహన కల్పించారు.