కొండపి: టంగుటూరులో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం నిర్వహణ
టంగుటూరులో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరు మండల పాస్టర్లు అందరూ కలిసి ర్యాలీ చేపట్టారు. టంగుటూరు రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించారు.