కొండపి: టంగుటూరు టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా
టంగుటూరు టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరింది. ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు GV కొండారెడ్డి మాట్లాడారు. రెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. టోల్ ప్లాజా యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. యాజమాన్యం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలన్నారు.