అద్దంకిలో మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ కార్మికులు 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో పెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు చంద్రబాబు నాయుడు మద్దతు పలుకుతున్నాడని పలువురు మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.