నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు పంపిణీకి సర్వం సిద్ధం అని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం రాత్రి 7:00 సమయంలో మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 1వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6.30 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.