అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న కురుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన మసూద్ వలి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వేజనా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.