వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సోషల్ వెల్ఫేర్ అధికారులకు సూచించారు శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి వసతి గృహాల్లో వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ ,సోషల్ వెల్ఫేర్ డిడి చింతామణి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.