మేడ్చల్ పట్టణ పరిధి గిర్మాపూర్ లో ఉన్న గెలాక్సీ రాక్ సాండ్ క్రషర్ యజమాన్యం రాయల్టీ బిల్లులు టిప్పర్లకు ఇవ్వకుండా అధిక లోడ్ తో వాహనాలు నడపాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు టిప్పర్ యాజమాన్లు మండిపడ్డారు. రాయల్టీ బిల్లులు ఇవ్వకపోవడంతో తమకు అధికారుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇదే విషయమై అధికారులు సదురు క్రషర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.