రెబ్బెన మండలం పుంజుమేరగూడ గ్రామంలో శనివారం సాయంత్రం 4గంటలకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను పోలీసులు నిర్వహించారు. రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఫోర్ వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని సీఐ కోరారు.