జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో ఉన్న సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తోట నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన నాయకుడు తోట రాంజీ ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.