వికారాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్పై జిల్లా కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించిన పట్టణ ఎస్సై అనిత
రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా సైబర్ క్రైమ్ బారిన పడి మోసపోవద్దని వికారాబాద్ పట్టణ ఎస్సై అనిత అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో గంగారం వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సైబర్ క్రైమ్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.