కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఓదెలు, వెంకటేష్ పాల్గొన్నారు