కనిగిరి: సైబర్ నేరాలపై విద్యార్థులకు పాఠశాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి: పెద చెర్లోపల్లి ఎస్సై కోటయ్య
పెదచెర్లోపల్లి ఎంఈఓ కార్యాలయంలో గురువారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు పెదచెర్లోపల్లి ఎస్సై జి కోటయ్య గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... సైబర్ నేరాలపై అవగాహన పొందిన ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి, వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.