కనిగిరి: పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: కనిగిరిలో రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు హనుమారెడ్డి
కనిగిరి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఏపీ రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు వడ్డే హనుమారెడ్డి బుధవారం రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు రూ లక్షల్లో నష్టాలను చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పొగాకు రైతులకు తక్షణం గిట్టుబాటు ధరలు కల్పించి వారిని ఆదుకోవాలని హనుమారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.