జిల్లాలోని రైతుల పరిస్థితి మరోసారి అగమ్య గోచరంగ మారింది : వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Jul 31, 2025
అనంతపురం జిల్లాలోని రైతంగం పరిస్థితి పూర్తి అగమ్య గోచరంగా మారిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వ అనుసరిస్తున్న తీరును తప్పు పట్టారు.