మహబూబ్ నగర్ అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,
ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయిజిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. 60 అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.