రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, పోతుగల్ గ్రామంలో అధిక ధరలకు విక్రయిస్తుర ఇసుక టిప్పర్ ను పట్టుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ గణేష్. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వల్లపు శ్రీకాంత్ అనే వ్యక్తి సిద్దిపేట నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా దొంగతనంగా తన టిప్పర్ లో ఇసుక నింపుకొని ముస్తఫాద్ మండల్ పోతుగల్ గ్రామం కు వచ్చాడు. ఆ గ్రామంలో అధిక ధరలకు ఇసుక అమ్మేందుకు రాగా పట్టుకొని ఇసుక టిప్పర్ సీజ్ చేసి కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్ కు తరలించామని ముస్తాబాద్ ఎస్సై గణేష్ వెల్లడించారు.