సత్యవేడు: రేపు సురుటుపల్లి ఆలయంలో దరఖాస్తుల పరిశీలన, ఆలయ ఈవో లత వెల్లడి
రేపు సురుటుపల్లి ఆలయంలో దరఖాస్తుల పరిశీలన నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆయల నూతన పాలకమండలి నియామకానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను గురువారం ఉదయం 9 గంటల నుంచి పరిశీలిస్తామని ఆలయ ఈవో లత తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో-1 తప్పక తీసుకురావాలన్నారు.