కనిగిరి: పామూరు పట్టణంలో ఈనెల 22న జరుగు జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి: జేవీవీ జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్
పామూరు పట్టణంలో ఈనెల 22వ తేదీన జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్ భాష అన్నారు. కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను వైద్యులతో కలిసి గయాజ్ భాష గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా స్థాయిలో పామూరు పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా మహాసభలను మేధావులు, విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.