తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షులు షర్మిల నుండి భీఫారం అందుకున్న మార్నిడి బాబ్జి.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి మార్నీడి బాబ్జి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి చేతులమీదుగా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్నీడి బాబ్జి బి ఫారం అందుకున్నారు. అయితే మార్నీడి బాబ్జి 24వ తేదీ బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.