రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్/ ఫిర్యాదుల కేంద్రం బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హెల్ప్ లైన్/ ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సలహాలు, సూచనలు అందిస్తారని, ఎన్నికల విషయమై ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, తదితరులు పాల్గొన్