రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలంలో 15 మంది గుడుంబా తయారీ, అమ్మకం దారులను బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల,లింగన్నపేట, లక్ష్మీపూర్ తండా, సముద్ర లింగాపూర్ తండా లకు చెందిన 15 మంది గుడుంబా తయారీ, అమ్మకం దారులను గంభీరావుపేట ఎమ్మార్వో మారుతి రెడ్డి ముందు బైండ్ ఓవర్ చేసినట్లు ఎక్సైస్ సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజు, వర్మ ఉన్నారు.