రాష్ట్రంలో మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం తగదని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. నిన్న తమ అధినేత జడ శ్రవణ్ కుమార్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమానికి వైసిపి మద్దతు పలకటం అభినందనీయమని అన్నారు. శ్రవణ్ కుమార్ కుమార్ పోరాటానికి టిడిపిలో వణుకు పుడుతుందని హేబేలు తెలియజేశారు.