అన్నమయ్య జిల్లాలో హెచ్ఐవి–ఎయిడ్స్ సేవలను గ్రామాల వరకు అందించేందుకు మొబైల్ ఐసిటిసి సంచార వాహనంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రారంభించింది. డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. కె. లక్ష్మి నర్సయ్య, డా. రాధిక ఈ వాహనాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ— దూర ప్రాంతాలు, హై రిస్క్ గ్రామాల్లో ప్రజలకు హెచ్ఐవి పరీక్షలు, కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు అందించేందుకు ఈ వాహనం పనిచేస్తుందని తెలిపారు. వ్యక్తిగత గోప్యతతో సేవలు అందించబడతాయని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు