కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రోజురోజుకు ధరలు దిగజారుతున్నాయని రైతులు ఆందోళన
కొండపి పొగాకు వేలం కేంద్రంలో రోజురోజుకు ధరలు దిగజారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం చోడవరం, ముప్పవరం గ్రామాలకు చెందిన రైతులు 388 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, వివిధ కారణాలతో 49 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. కేజీ రూ.280 కొనుగోలు చేసిన డీలర్లు ప్రస్తుతం రూ.240కు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.