సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ కు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మానేరు నది తీరాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఆవరణలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రామ ప్రజలు సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్ దీపాలు, బతుకమ్మ ఆటలు ఆడుకునేందుకు డీజే సౌండ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ సెక్రటరీ సమీర్ తెలిపారు