కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కాలనీలు, గ్రామాలను శుక్రవారం పోలీస్ అధికారులు సందర్శించి మహిళా భద్రత పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సమాజంలో మహిళల భద్రత, మహిళల రక్షణ కు బి.ఎన్.ఎస్ లో ఉన్న చట్టాలను, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా దుర్వినియోగం,ఆన్లైన్ భద్రత విషయాలపై వారికి విస్తృతమైన అవగాహన కల్పించారు. మొబైల్, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే ప్రమాదాలను గుర్తించటం, అనుమానాస్పద లింకులు లేదా అనుచిత సందేశాలు వచ్చినప్పుడు వెంటనే పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.