బంగారానికి మెరుగు పెడతామని ఓ వృద్ధురాలిని ఇద్దరు దుండగులు మోసగించారు. 2లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. కాగజ్ నగర్ లో నివసిస్తున్న సంధ్య శ్రీవాత్సవ ఇంటికి సోమవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారానికి మెరుగు పెడతామని చెప్పారు.వారిని నమ్మిన ఆ వృద్ధురాలు తన బంగారపు చెవి కమ్మలు,చైన్ మెరుగు పెట్టేందుకని వారికి ఇచ్చింది. వారు వాటిని అపహరించి పారిపోయారు.