కొరిశపాడు గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జీ.వి సుబ్బారెడ్డి, ఎండిఓ రాజ్యలక్ష్మి లు పాల్గొని పరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మొక్కలు నాటకం తో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ దర్గా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.