అద్దంకి పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెరికపాలెం కు చెందిన భార్య భర్తలు ప్రసన్నాంజనేయులు పార్వతీలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని వారిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.