రాష్ట్రంలో వైసీపీ అరాచకా పాలన కొనసాగుతుందని పునగుంటలో పేర్కొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్
చిల్లకురు మండలంలోని పునగుంట గ్రామంలో జనంకోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర శేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. ఏ ఇంటికెళ్ళినా సమస్యలతో అల్లాడుతున్నారని అన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పడం తనకు చాలా సంతోషంగా ఉందని చంద్ర శేఖర్ పేర్కొన్నారు.