ముమ్మిడివరం: కొత్తలంక లో ఘనంగా వలీ బాబా ఉరుసు మహోత్సవం, వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు
ముమ్మిడివరం మండలం, కొత్తలంక లో వలౌ బాబా 78వ ఉరుసు మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మతాలకతీతంగా ఈ ఉరుసు మహోత్సవం నిర్వహిస్తారు. బాబా సమాధిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉరుసు మహోత్సవానికి ప్రత్యేకత ఉంది. రాత్రి రెండు గంటల సమయంలో బాబా సమాధికి గంధం పూసే కార్యక్రమం చాలా ప్రత్యేకమైంది. బాబా సమాధిని హిందూ ముస్లింలు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు