అమలాపురంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల
పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను సత్కరించి కలెక్టర్ అభినందించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించడం శుభ పరిణామం అని కలెక్టర్ అన్నారు.