అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు సోమవారం సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ లు పాల్గొని విద్యార్థులకు సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రవికుమార్ సొంత ఖర్చులతో విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.