ఆత్మకూరులో తొమ్మిది నెలల క్రితం జరిగిన భారీ దొంగతనాన్ని చాలెంజింగా తీసుకొని అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పోలీసులు
ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో 9 నెలల క్రితం జరిగిన భారీ దొంగతనాన్ని నంద్యాల జిల్లా పోలీసులు ఛాలెంజింగ్ తీసుకొని చేదించారు. గత సంవత్సరం జూన్ 23వ తేదీ పట్టపగలే భారీ దొంగతనం జరిగింది.S.R.B.C లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న శరభా రెడ్డి ఇంట్లో సుమారు 40 తులాల బంగారం దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులంతా కలిసి పోస్ట్ వెడ్డింగ్ షూట్ కు YSR స్మృతి వనం వెళ్లడంతో,ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు దొంగతనం చేశారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో సుమారు 40 తులాల బంగారాన్ని పట్టపగలే చాకచక్యంగా దొంగ కొట్టేశాడు. ఆ తర్వాత ఆత్మకూరు పోలీసులు క్లూస్ టీం సహాయంతో చాలా కష్టపడ్డారు.