కనిగిరి: కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై సిపిఐ నాయకత్వం ఒత్తిడి తేవాలి: కనిగిరి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి యాసిన్
వెనుకబడిన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ పార్టీ ప్రకాశం జిల్లా నాయకత్వం ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందని కనిగిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి సయ్యద్ యాసిన్ కోరారు. దర్శి పట్టణంలో శనివారం జరిగిన సిపిఐ పార్టీ జిల్లా మహాసభలలో యాసీన్ మాట్లాడారు. కనిగిరి నియోజకవర్గంలో వలసలు ఎక్కువ అని, వలసల నివారణకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావలసిన అవసరం ఉందన్నారు, ఇంటింటికి సురక్షిత మంచినీరు, విద్యార్థుల కోసం ట్రిపుల్ ఐటి కళాశాల నిర్మాణం జరగవలసి ఉందని, ఈ సమస్యల పరిష్కారానికి సిపిఐ జిల్లా నాయకత్వం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యాసిన్ కోరారు.