అద్దంకిలోని మున్సిపల్ కార్యాలయం నందు గురువారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 12వ పిఆర్సి ని అమలు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ తమకు 62 సంవత్సరాలు వయోపరిమితి వర్తింపచేయాలని అన్నారు. షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు.