కెరమెరి మండలంలోని లైన్ పటార్ గిరిజన గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లైన్ పటార్ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం త్రాగు నీరు సదుపాయం కూడా కల్పించలేదన్నారు. గ్రామంలో పాఠశాల అంగన్వాడి భవనం కూడా లేదన్నారు. ఇప్పటికైనా లైన్ పటార్ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.