బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షించ దగ్గ విషయమని శుక్రవారం కోవెలకుంట్ల ప్రజా సంఘ నాయకులు అన్నారు . గతంలో కోవెలకుంట్ల మండలానికి డోన్ డివిజన్ ఉండడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కావడంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గరగా ఉండటం మంచి పరిణామం అని మంత్రి బీసీకి కృతజ్ఞతలు తెలిపారు.